
సీఎం రేవంత్ పాలనను చూసి కేటీఆర్ తట్టుకోలేకపోతున్నారని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. రాజకీయ విమర్శలకు మాత్రమే కేటీఆర్ ప్రాధాన్యతనిస్తున్నారని చెప్పారు. కేసీఆర్ గతంలో యూత్ కాంగ్రెస్ లీడర్ గా పనిచేశారని చెప్పారు. కేసీఆర్ కూడా పార్టీలు మారారని గుర్తు చేశారు. కేటీఆర్ కు సీఎం రేవంత్ ను నైతికంగా విమర్శించే అర్హత లేదన్నారు.
అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు సీఎంను కలవొద్దనే రూల్ లేదన్నారు జగ్గారెడ్డి. కేసీఆర్ వచ్చాక అపోజిషన్ ఎమ్మెల్యేలు కలవడమే మానేశారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సంప్రదాయాన్నే రేవంత్ మళ్లీ కొనసాగిస్తున్నారని చెప్పారు. కేసీఆర్ పాలనలో ప్రజాస్వామ్యం సచ్చిపోయిందని..తాము అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్యానికి మళ్లీ ప్రాణం పోస్తున్నామని చెప్పారు.
అసోంలో రాహుల్ పై దాడి దుర్మార్గమన్నారు జగ్గారెడ్డి . రాజకీయంగా రాహుల్ ను అణగదొక్కేందుకు కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. దేశంలో ప్రజల కోసం ప్రాణ త్యాగాలు చేసిన చరిత్ర కాంగ్రెస్ దేనన్నారు.