ఖైరతాబాద్, వెలుగు : మాజీ ఎంపీ రవీంద్రనాయక్ బీజేపీకి రాజీనామా చేశారు. శనివారం ఆయన సోమాజిగూడ ప్రెస్క్లబ్లో జరిగిన సమావేశంలో మాట్లాడారు. బంజారా కమిషన్ఏర్పాటుకు తాను మూడేండ్లుగా ప్రయత్నించినా బీజేపీ నాయకత్వం నిర్లక్ష్యం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో నల్గొండ స్థానం నుంచి పోటీ చేస్తానని అభ్యర్థించినా పట్టించుకోలేదని చెప్పారు. అందుకే పార్టీ నాయకత్వానికి మెయిల్ద్వారా రిజైన్ లెటర్ పంపుతున్నట్లు రవీంద్రనాయక్ వెల్లడించారు. సమావేశంలో బంజారా సేవాలాల్ సమితి జాతీయ కన్వీనర్ భరత్ రవినాయక్, అశోక్ రాథోడ్పాల్గొన్నారు.