బీజేపీకి మాజీ ఎంపీ రవీంద్రనాయక్ ​రాజీనామా

బీజేపీకి మాజీ ఎంపీ రవీంద్రనాయక్ ​రాజీనామా

ఖైరతాబాద్, వెలుగు : మాజీ ఎంపీ రవీంద్రనాయక్ బీజేపీకి​ రాజీనామా చేశారు. శనివారం ఆయన సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో జరిగిన  సమావేశంలో మాట్లాడారు. బంజారా కమిషన్​ఏర్పాటుకు తాను మూడేండ్లుగా  ప్రయత్నించినా బీజేపీ నాయకత్వం నిర్లక్ష్యం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో నల్గొండ స్థానం  నుంచి పోటీ చేస్తానని అభ్యర్థించినా పట్టించుకోలేదని చెప్పారు. అందుకే పార్టీ నాయకత్వానికి మెయిల్​ద్వారా రిజైన్ లెటర్ పంపుతున్నట్లు రవీంద్రనాయక్ వెల్లడించారు. సమావేశంలో బంజారా సేవాలాల్​ సమితి జాతీయ కన్వీనర్​ భరత్​ రవినాయక్​, అశోక్ రాథోడ్​పాల్గొన్నారు.