టీమిండియా గురించి ఆందోళన అవసరం లేదు

టీమిండియా గురించి ఆందోళన అవసరం లేదు

టీమిండియా నయా కెప్టెన్ రోహిత్ శర్మపై వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామీ ప్రశంసలు కురిపించాడు. రోహిత్ చేతుల్లో టీమిండియా జట్టు సురక్షితంగా ఉందన్నాడు. తాను టీమిండియా గురించి ఆందోళన చెందడం లేదన్నాడు. ఐపీఎల్ లో ఐదు టైటిళ్లు సాధించిన అతడి ప్రతిభ అందరికీ తెలుసన్నాడు. అతను స్ఫూర్తిదాయకమైన కెప్టెన్ అని అన్నాడు. ఆటగాళ్లను ప్రోత్సహించడం.. వాళ్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టడం రోహిత్ కు బాగా తెలుసన్నాడు. రోహిత్ కు ధోని లాంటి దిగ్గజాల సరసన నిలబడేటువంటి సామర్థ్యం ఉందన్నాడు. ఫ్రిబ్రవరి 6 నుంచి వెస్టిండీస్ తో ఇండియా 3 టీ20లు, 3 వన్డేలు  ఆడనుంది.