అప్పుల బాధతో ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య

అప్పుల బాధతో ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య

మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం మల్కపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఉరి వేసుకొని నలుగురు కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.రమేశ్‌(40), పద్మ(35) దంపతులు ఓ గదిలో, కుమారుడు అక్షయ్‌(17), కుమార్తె సౌమ్య(19) మరో గదిలో ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నారు. ఇటీవలే కుమార్తె అత్తింటి నుంచి పుట్టింటికి వచ్చింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. అప్పుల బాధతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు ఆ గ్రామస్థులు.