విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య

విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య

రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ నలుగురు ఆత్మహత్యకు పాల్పడినట్టుగా స్థానికులు చెబుతున్నారు. జిల్లాలోని అంబేద్కర్ నగర్ రామాలయం వీధిలో సంగిశెట్టి కృష్ణవేణి, పావని, నిషాన్, రితికలు ఆత్మహత్య చేసుకొన్నారు. తల్లీ ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.