విషాదం: ప్రమాదవశాత్తు బావిలో పడి నలుగురు మృతి

విషాదం: ప్రమాదవశాత్తు బావిలో పడి నలుగురు మృతి

చిత్తూరు జిల్లాలో గురువారం విషాదం జరిగింది. కుప్పం మండలం కృష్ణదాసనపల్లి పంచాయతీ చింపనగల్లు గ్రామంలో బావిలో పడి నలుగురు మృతి చెందారు. వీరిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు.

మునిలాల్ ప్రసాద్ భార్య రుక్మిణీ (30) తన ఇద్దరు కుమార్తెలు హారతి, కీర్తి ….మరిది భార్య రాజేశ్వరి (26)లు ఉదయం బట్టలు ఉతికేందుకు గ్రామ సమీపంలోని కుంట దగ్గరకు వెళ్లారు. బట్టలు ఉతుకుతుండగా నీటి కుంట దగ్గర ఆడుకుంటున్న ఇద్దరూ చిన్నారులు ప్రమాదవశాత్తు బావిలో పడిపోవడంతో వారిని తల్లి రుక్మిణి నీటి గుంటలో దూకేసింది. ఈ ప్రయత్నంలో ముగ్గురు మునిగిపోవడంతో వారిని రక్షించేందుకు రాజేశ్వరి ప్రయత్నించి మృత్యువాత పడింది.

ఒకే గ్రామంలో నలుగురు మృతిచెందడంతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మరోవైపు అప్పటి వరకు తమ ముందు ఉన్న పిల్లలు విగతజీవులుగా మారడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.