అయ్యో ఎంత ఘోరం: నాలుగేళ్ల పిల్లాడిని డ్రైనేజ్‌లో వేసిండు

అయ్యో ఎంత ఘోరం: నాలుగేళ్ల పిల్లాడిని డ్రైనేజ్‌లో వేసిండు

మహారాష్ట్రంలోని నాసిక్ లో మార్చి 5న ఓ విషాదకర ఘటన జరగగా.. అది ఇటీవల వెలుగులోకి వచ్చింది.  13 ఏళ్ల బాలుడు  నాలుగేళ్ల పిల్లాడిని డ్రైనేజ్ నీటి కుంటలో విసిరేశాడు. ఆ చిన్నారి నీటిలో గిలగిలా కొట్టుకుంటూ చనిపోయాడు. పవార్ వాడి పోలీస్ స్టేషన్ పోలీసులు నిందితునిపై కేసు నమోదు చేశారు. నాసిక్ లోని దాతర్ నగర్ లోని  ఓ కరప్షనల్ హోమ్ లో ఉంటున్న  మాలిక్ హుస్సేన్(13) తోటి పిల్లలతో ఆడుకుంటూ వారిలో ఓ చిన్నవాడైన నాలుగేళ్ల బాలుడిని డ్రైనేజ్ వాటర్ లోకి విసిరేశాడు. 

ALSO READ :-మార్చి 18 నుంచి పదో తరగతి పరీక్షలు... హాల్​ టికెట్​ ఇలా డౌన్​ లోడ్​ చేసుకోండి...

ఆ వీడియో అక్కడే ఉన్న ఓ సీసీకెమోరాలో రికార్డ్ అయ్యింది. పోలీసులు అతనిపై మర్డర్ కేసు ఫైల్ చేశారు. ఈ ఘటన తర్వాత మాలిక్ హూస్సేన్ అక్కడి నుంచి పారిపోయాడు.