మహారాష్ట్రంలోని నాసిక్ లో మార్చి 5న ఓ విషాదకర ఘటన జరగగా.. అది ఇటీవల వెలుగులోకి వచ్చింది. 13 ఏళ్ల బాలుడు నాలుగేళ్ల పిల్లాడిని డ్రైనేజ్ నీటి కుంటలో విసిరేశాడు. ఆ చిన్నారి నీటిలో గిలగిలా కొట్టుకుంటూ చనిపోయాడు. పవార్ వాడి పోలీస్ స్టేషన్ పోలీసులు నిందితునిపై కేసు నమోదు చేశారు. నాసిక్ లోని దాతర్ నగర్ లోని ఓ కరప్షనల్ హోమ్ లో ఉంటున్న మాలిక్ హుస్సేన్(13) తోటి పిల్లలతో ఆడుకుంటూ వారిలో ఓ చిన్నవాడైన నాలుగేళ్ల బాలుడిని డ్రైనేజ్ వాటర్ లోకి విసిరేశాడు.
ALSO READ :-మార్చి 18 నుంచి పదో తరగతి పరీక్షలు... హాల్ టికెట్ ఇలా డౌన్ లోడ్ చేసుకోండి...
ఆ వీడియో అక్కడే ఉన్న ఓ సీసీకెమోరాలో రికార్డ్ అయ్యింది. పోలీసులు అతనిపై మర్డర్ కేసు ఫైల్ చేశారు. ఈ ఘటన తర్వాత మాలిక్ హూస్సేన్ అక్కడి నుంచి పారిపోయాడు.