వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి

వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి

నగరంలో రోజురోజుకూ వీధి కుక్కల బెడద మరింత ఎక్కువవుతోంది. హైదరాబాద్ లో తాజాగా జరిగిన వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన అందర్నీ కలచి వేస్తోంది. బాగ్ అంబర్ పేటలో ఉంటున్న గంగాధర్.. తన కొడుకు ప్రదీప్ ను సర్వీస్ సెంటర్ కి తీసుకెళ్లాడు. అనంతరం అక్కడ్నుంచి గంగాధర్ వెళ్లిపోగా.. అప్పుడే నడుచుకుంటూ బయటకు వెళ్లిన బాలుడిపై వీధి కుక్కలు ముట్టడించి దాడి చేశాయి. దీంతో బాలుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆ తర్వాత బాలున్ని రెండు కుక్కలు నోట కరచుకుని చెరోవైపు లాగడంతో చనిపోయాడు. దీనికి సంబంధించిన విజువల్స్ అక్కడ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.