తక్కువ ధరకు ఐఫోన్ ​అంటూ మోసం.. వ్యక్తి అరెస్ట్​

తక్కువ ధరకు ఐఫోన్ ​అంటూ మోసం.. వ్యక్తి అరెస్ట్​

మాదాపూర్, వెలుగు: మా నాన్న ఆర్మీ మాజీ ఉద్యోగి అని, ఆర్మీ క్యాంటీన్​లో ఐఫోన్​ను తక్కువ ధరకు ఇప్పిస్తానంటూ ఓ రియల్​ఎస్టేట్ వ్యాపారిని చీటింగ్​ చేసిన వ్యక్తిని మాదాపూర్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. ఇన్ స్పెక్టర్ ​తిరుపతి వివరాల ప్రకారం.. మాదాపూర్​కు చెందిన  కె.శ్రీనాథ్​రియల్​ఎస్టేట్ ​బిజినెస్ ​చేస్తున్నాడు. మేడ్చల్ లోని​సరస్వతి నగర్​కు చెందిన డి.పృథ్వీరాజ్(34) సోషల్​మీడియాలో శ్రీనాథ్​ ఫోన్​నంబర్​ తీసుకొని ఓ ఫ్లాట్ గురించి మాట్లాడి స్నేహం పెంచుకున్నాడు.

తన తండ్రి ఆర్మీ మాజీ ఉద్యోగి అని, ఆర్మీ క్యాంటీన్​లో అన్ని వస్తువులు తక్కువ ధరకు వస్తాయని శ్రీనాథ్​ను నమ్మించాడు. దీంతో తనకు ఐఫోన్​కావాలని చెప్పి పృథ్వీరాజ్​అకౌంట్​కు రూ.81వేల 500  పంపించాడు. ఆ తర్వాత నుంచి పృథ్వీరాజ్ ​స్పందించకపోవడంతో శ్రీనాథ్​ మాదాపూర్ పోలీసులకు కంప్లైంట్​చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోమవారం పృథ్వీరాజ్​ను అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు. అతడిపై పలు కమిషనరేట్ల పరిధిలో ఇప్పటికే 8 కేసులు ఉన్నట్లు తెలిపారు.