మాదాపూర్, వెలుగు: మా నాన్న ఆర్మీ మాజీ ఉద్యోగి అని, ఆర్మీ క్యాంటీన్లో ఐఫోన్ను తక్కువ ధరకు ఇప్పిస్తానంటూ ఓ రియల్ఎస్టేట్ వ్యాపారిని చీటింగ్ చేసిన వ్యక్తిని మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్ స్పెక్టర్ తిరుపతి వివరాల ప్రకారం.. మాదాపూర్కు చెందిన కె.శ్రీనాథ్రియల్ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు. మేడ్చల్ లోనిసరస్వతి నగర్కు చెందిన డి.పృథ్వీరాజ్(34) సోషల్మీడియాలో శ్రీనాథ్ ఫోన్నంబర్ తీసుకొని ఓ ఫ్లాట్ గురించి మాట్లాడి స్నేహం పెంచుకున్నాడు.
తన తండ్రి ఆర్మీ మాజీ ఉద్యోగి అని, ఆర్మీ క్యాంటీన్లో అన్ని వస్తువులు తక్కువ ధరకు వస్తాయని శ్రీనాథ్ను నమ్మించాడు. దీంతో తనకు ఐఫోన్కావాలని చెప్పి పృథ్వీరాజ్అకౌంట్కు రూ.81వేల 500 పంపించాడు. ఆ తర్వాత నుంచి పృథ్వీరాజ్ స్పందించకపోవడంతో శ్రీనాథ్ మాదాపూర్ పోలీసులకు కంప్లైంట్చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోమవారం పృథ్వీరాజ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అతడిపై పలు కమిషనరేట్ల పరిధిలో ఇప్పటికే 8 కేసులు ఉన్నట్లు తెలిపారు.