గోదావరిఖని, వెలుగు: గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, ఎస్ఐ, కానిస్టేబుల్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ వంటి ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు రామగుండం మేయర్ మహాంకాళి స్వామి, హైదరాబాద్కు చెందిన పీజేఎఆర్ కోచింగ్సెంటర్ డైరెక్టర్ జగదీశ్వర్రెడ్డి తెలిపారు.
గురువారం వారు మాట్లాడుతూ గోదావరిఖని సింగరేణి హైస్కూల్లో శిక్షణ ఇవ్వనున్నామని, అర్హులైన అభ్యర్థులకు శుక్రవారం నుంచి ఈ నెల 25 వరకు రామగుండం మున్సిపల్ ఆఫీస్లో అప్లికేషన్ ఫాంలను అందజేస్తామని చెప్పారు. జూలై మొదటి వారంలో ప్రారంభమయ్యే ఈ శిక్షణను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
