హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం(రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం)లో జనవరి 25 తేదీ నుంచి 30వ తేదీ వరకు భారత్-ఇంగ్లండ్ మధ్య జరగనున్న తొలి టెస్టుకు జరగనున్న టెస్టు మ్యాచ్ ను చూసేందుకు టికెట్ లేకుండా ఉచితంగా అనుమతించేందుకు హెచ్ సీఏ నిర్ణయించింది. అయితే ఫ్రీ ఎంట్రీ అందరికీ కాదు.. కేవలం స్కూల్ విద్యార్థులకే.
ఈ టెస్టు మ్యాచ్ కు నగరంలోని ప్రభుత్వ పాఠశాలలతోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూల్స్ విద్యార్థులను ఉచితంగా అనుమతించనున్నారు. మ్యాచ్కు విచ్చేసే విద్యార్థులకు హెచ్సీఏ ఉచితంగా భోజనం కూడా అందించనుంది. ఈనెల 18వ తేదీ లోపు హెచ్సీఏ సీఈఓకు పాఠశాలల ప్రిన్సిపాల్స్ తమ స్కూల్ నుంచి ఎంత మంది విద్యార్థులు, స్టాప్ వస్తున్నారో తెలిపాలని పేర్కొంది.
కాగా, భారత్ టెస్టు సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు త్వరలో ఇండియాకు రానుంది. ఇరుజట్ల మధ్య ఈనెల 25 నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. మొత్తం ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ మార్చి 11వ తేదీ వరకు జరగనుంది.