ప్యాసింజర్లకు ఫ్రీగా రూ.25 లక్షల ఇన్సూరెన్స్‌‌

ప్యాసింజర్లకు ఫ్రీగా రూ.25 లక్షల ఇన్సూరెన్స్‌‌

న్యూఢిల్లీ: ఢిల్లీ -లక్నో తేజాస్‌‌ ఎక్స్‌‌ ప్రెస్‌‌ రైలు ప్రయాణికులకు ఐఆర్‌ సీటీసీ బంపర్‌ ఆఫర్లను ప్రకటించింది. ప్యాసెంజర్లకు ఫ్రీగా రూ. 25 లక్షల ఇన్సూరెన్స్‌‌ తో పాటు ఫ్రీ లాంజ్‌‌లు, టాక్సీ సర్వీసులు కూడా ఉచితంగా ఇస్తున్నట్టు ఐఆర్‌ సీటీసీ తెలిపింది. వచ్చే నెలలో ఢిల్లీ -లక్నో మధ్య తేజాస్‌‌ ఎక్స్‌‌ ప్రెస్‌‌ ట్రయిన్‌ సర్వీసు మొదలు కానుంది. రైలు సర్వీసు ల ప్రొవైడర్‌ గా ఐఆర్‌ సీటీసీ ఉండడం ఇదే మొదటిసారి. ప్యాసింజర్లకు వరల్డ్‌ క్లాస్‌‌ సౌకర్యాలు కల్పించే దిశగా ప్రైవేటు ట్రయిన్‌ ఆపరేటర్లను వినియోగించు కోవాలని రైల్వేశాఖ ప్రతిపాదించింది.

ఈ ట్రైన్‌ ప్రత్యేకతలు

  • ఈట్రైన్‌ లో కన్సెషన్లు, డ్యూటీ పాస్‌‌లు చెల్లవు.
  • తత్కాల్‌ కోటా ఉండదు.
  • టిక్కెట్లు డైనమిక్‌ గా ఉంటాయి.
  • పండగలు, డిమాండ్‌ ను బట్టి టిక్కెట్‌ ధరల నిర్ణయం.
  • అడ్వాన్స్‌‌ బుకింగ్‌‌60 రోజులే (మిగతా ట్రైన్లకుఇది120 రోజులు)
  • ప్యాసెం జర్లకు ఫ్రీగా టీ, కాఫీ సప్లయ్‌‌