పండ్ల మార్కెట్​ ఇంకొన్నాళ్లు గడ్డి అన్నారంలోనే

పండ్ల మార్కెట్​ ఇంకొన్నాళ్లు గడ్డి అన్నారంలోనే
  • బాటసింగారంలో సౌలత్​లపై రిపోర్టు ఇవ్వాలని హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్​లో కార్యకలాపాలు తదుపరి విచారణ జరిగే దాకా ఎప్పటిలాగే కొనసాగించాలని హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. బాటసింగారంలో మార్కెట్‌ నిర్వహణకు కావాల్సిన సౌలత్​లు ఉన్నాయో లేదో తేల్చేందుకు కోర్టు కమిషనర్‌ను నియమించింది. ఈ నెల19వరకు రిపోర్టు ఇవ్వాలని ఆదేశించింది. అప్పటిదాకా ఫ్రూట్ మార్కెట్​ను గడ్డి అన్నారంలో కొనసాగించాలని పేర్కొంది. బాటసింగారానికి ఫ్రూట్ మార్కెట్ తరలింపు విషయంలో హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం పాటించట్లేదంటూ కమీషన్‌ ఏజెంట్స్‌ దాఖలు చేసిన అప్పీల్‌ పిటిషన్‌ను చీఫ్‌ జస్టిస్‌ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్‌ రాజశేఖర్‌రెడ్డిల డివిజన్‌ బెంచ్‌ మంగళవారం విచారించింది. బాటసింగారంలో అన్ని ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం చెప్పింది. సౌలత్​లు కల్పించకుండానే తరలిస్తున్నారని, అడ్డుకోవాలని పిటిషనర్ తరఫు లాయర్ వాదనలు వినిపించారు. విచారణ ఈ నెల19కి వాయిదా పడింది.