క్వారంటైన్ కేంద్రంగా గ‌చ్చిబౌలి స్టేడియం

క్వారంటైన్ కేంద్రంగా గ‌చ్చిబౌలి స్టేడియం

కరోనా వైర‌స్ వ్యాప్తిని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్ప‌టికే అన్ని ర‌కాల చ‌ర్య‌లు చేపట్టింది. కరోనా బాధితులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేలా…మెరుగైన ట్రీట్ మెంట్ అందించేందుకు గ‌చ్చిబౌలి స్టేడియాన్ని క్వారంటైన్ కేంద్రంగా ఏర్పాటు చేయనుంది. స్టేడియంలో మొత్తం 50 ప‌డ‌క‌ల‌ను ఏర్పాటు చేయ‌నుంది.

వైద్యాధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు ఇప్ప‌టికే స్టేడియాన్ని ప‌రిశీలించారు. శేరిలింగంప‌ల్లి స‌ర్కిల్ 11 పారిశుద్ధ్య సిబ్బంది స్టేడియంలో ప‌నులు నిర్వ‌హిస్తున్నారు. దీంతో మ‌రో 2 రోజుల్లో స్టేడియం క్వారంటైన్ కేంద్రంగా మారనుంది. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి క‌రోనా అనుమానితుల‌ను నేరుగా స్టేడియంకు త‌ర‌లించి అందులో వారిని ప‌రిశీల‌న‌లో ఉంచే అవ‌కాశం ఉంది.

కరోనా ఎఫెక్ట్ తో ఇప్పటికే మార్చి 31వ తేదీ వ‌ర‌కు జ‌న స‌మ్మ‌ర్థం ఎక్కువ‌గా ఉండే ప్ర‌దేశాల‌ను మూసివేశారు. సినిమా హాల్స్‌, మాల్స్‌, స్కూళ్లు, కాలేజీలు, జిమ్‌లు, ప‌బ్‌లు, బార్ల‌ను మూసివేస్తున్న‌ట్లు ప్రకటించారు అధికారులు.