![నేనూ పీసీసీ రేసులో ఉన్నా:ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్](https://static.v6velugu.com/uploads/2024/05/pcc-working-president-mahesh-kumar-goud-said-that-i-will-in-race-for-new-chief-for-telangana_GbJv5snr7l.jpg)
- సమర్థులకే హైకమాండ్ చాన్స్
- ఎవరి ప్రయత్నాలు వారివి
- ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్
హైదరాబాద్: త్వరలోనే కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణకు కొత్త చీఫ్ ను నియమిస్తుందని, తానూ రేసులో ఉన్నానని ఎమ్మెల్సీ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు. ఇవాళ గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. పదవి కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారని అన్నారు. సామాజిక కోణంతో సంబంధం లేకుండా సమర్థులకే రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కుతుందని అన్నారు. అనుభవం, సీనియార్టీని దృష్టిలో పెట్టుకొని పీసీసీ చీఫ్ ఎంపిక ఉంటుందని చెప్పారు.
సిగ్గు లేకుండా ధర్నాలు చేస్తుండ్రా?
‘బీ ఆర్ ఎస్ నేతలు సిగ్గు, లజ్జా లేకుండా ధర్నాలు చేస్తున్నారు. రైతులకు సంకెళ్లు వేసింది మీరు కాదా? మీ పాలనలో రైతులకు గజ దొంగల్లా బేడీలు వేశారు. గత పదేళ్లల్లో రైతులకు మీరు ఏం చేశారు? నేరెళ్ల ఘటన ఎవరి హయాంలో జరిగింది? వరి వేస్తే ఉరి అన్నది ఎవరు? రైతులను వరి సాగు వద్దని చెప్పి కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో వరి వేసుకోలేదా? కేసీఆర్ లాగా రైతుల విషయంలో మోసం చేసే సర్కార్ మాది కాదు’అని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.