విద్యార్థుల కోసం ప్రత్యేక స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు ఇవే!

విద్యార్థుల కోసం ప్రత్యేక స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు ఇవే!

స్మార్ట్​ఫోన్ ​మేకర్ ​ఐకూ విద్యార్థుల కోసం జెడ్11 స్మార్ట్​ఫోన్​ను ఈ నెల 20న మార్కెట్లోకి  తెస్తోంది.   రూ.40 వేల లోపు ధరలో లభించే ఈ ఫోన్​ చదువుకోవడానికి, నోట్స్ రాసుకోవడానికి, కంటెంట్ సృష్టించడానికి, ఏఐ వాడకం కోసం ఎంతో ఉపయోగపడుతుంది.  లెక్చర్లు, సమావేశాలలో ముఖ్యమైన అంశాలను సులభంగా నోట్​ చేసుకోవడానికి సాపడుతుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 7500 టర్బో ప్రాసెసర్‌‌‌‌, అమోలెడ్ డిస్‌‌‌‌ప్లే, 7,050 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు దీని సొంతం. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా నోయిడా ఫ్యాక్టరీలో దీనిని తయారు చేస్తున్నామని ఐకూ తెలిపింది.