ఆగస్టు 6న రవీంద్రభారతిలో గద్దర్ స్మారక సభ

ఆగస్టు 6న  రవీంద్రభారతిలో గద్దర్ స్మారక సభ

ఓయూ, వెలుగు: రవీంద్రభారతిలో గురువారం గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గద్దర్​3వ వర్ధంతిని పురస్కరించుకొని స్మారక సభ నిర్వహిస్తున్నట్లు ఆయన కుమారుడు, సంస్థ ఫౌండర్​సూర్యకిరణ్​తెలిపారు. మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఎదుట సంబంధిత వాల్​పోస్టర్​ఆవిష్కరించారు. ఈ సభకు రాజ్యాంగ నిర్మాత బీఆర్.అంబేడ్కర్ మనవడు ప్రకాశ్​అంబేడ్కర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని, కవులు, కళాకారులు, విద్యార్థులు, మేధావులు అధిక సంఖ్యలో తరలిరవాలని కోరారు.