- సుభాష్ చంద్రబోస్ కూతురు అనిత
న్యూఢిల్లీ: నేతాజీ, గాంధీ ఇద్దరూ దేశ స్వాతంత్ర్యంకోసం పోరాడిన హీరోలేనని, ఇద్దరిలో ఎవరి పాత్ర నూ తక్కువ చేయలేమని నేతాజీ కూతురు అనితా బోస్ చెప్పారు. బాలీవుడ్ యాక్టర్ కంగనా రనౌత్ కామెంట్లపై బుధవారం స్పందించా రు. నేతాజీ, గాంధీల మధ్య రిలేషన్ కొంచెం టఫ్గానే ఉండేదన్నారు. ‘‘నేతాజీని కంట్రోల్ చేయలేనని గాంధీ అనుకునేవారు. నాన్నేమో గాంధీని గొప్పగా ఆరాధించేవారు. వారి మధ్య రిలేషన్ కొంచెం టఫ్ గానే ఉండేది. అయితే ఒకరు లేకుం డా మరొకరు ఇండిపెండెన్స్ ను సాధించలేకపోయేవారు.స్వాతం త్ర్య సాధనలో అహింసా మార్గంతో పాటూ నేతాజీ, ఇండియన్ నేషనల్ ఆర్మీ(ఐఎన్ఏ) చేసిన కృషి కూడా ఉందని అనిత పేర్కొన్నారు.