పద్మారావునగర్, వెలుగు: బీపీ మెషీన్ ఎత్తుకెళ్లి ఓ యువకుడు రీల్స్ చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. వివరాలిలా ఉన్నాయి.. సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ ప్రధాన భవనం మూడో అంతస్తు వార్డులో ఓ యువకుడు తన తాతను అడ్మిట్ చేశాడు. అక్కడ బీపీ చెక్ చేయలేదనే కోపంతో డిజిటల్ బీపీ మెషిన్ దొంగిలించాడు.
‘గాంధీ దవాఖాన ఒక భూత్ బంగ్లా’ అని కామెంట్ చేశాడు. దీన్ని ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ రీల్ వైరల్గా మారింది. గాంధీ హాస్పిటల్ పాలకవర్గం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో యువకుడి వివరాలు సేకరిస్తున్నట్లు సీఐ రామకృష్ణ తెలిపారు.
