రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని ..ఓయూలో విద్యార్థి సేన పోరుదీక్ష

రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని  ..ఓయూలో విద్యార్థి సేన పోరుదీక్ష

ఉప్పల్​, వెలుగు: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల పోస్టులు భర్తీ చేయాలంటూ ఓయూలో విద్యార్థి సేన ఆధ్వర్యంలో మంగళవారం నిరుద్యోగ పోరు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్ధి సేన లీడర్లు మాట్లాడుతూ కాంగ్రెస్​అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి అమలుచేయకపోవడంతో నిరుద్యోగులు నిరాశలో ఉన్నారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలుచేయాలని డిమాండ్​ చేశారు. పోలీస్  డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లో ఖాళీల భర్తీ, డీఎస్సీ నోటిఫికేషన్, నిరుద్యోగులకు ఏజ్ రిలాక్సేషన్​ఇవ్వాలని కోరారు. కాగా దీక్షకు పర్మిషన్​ లేదంటూ విద్యార్థి సేన స్టేట్​ప్రెసిడెంట్​శివప్రసాద్‌‌‌‌ను పోలీసులు అరెస్ట్​ చేశారు. దీక్షను అడ్డుకునేందుకు అరెస్ట్‌‌‌‌లు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని విద్యార్థి సేన లీడర్లు విమర్శించారు.