హోటల్ లో.. గుండెపోటుతో గాంధీ ఆస్పత్రి డాక్టర్ మృతి

హోటల్ లో.. గుండెపోటుతో గాంధీ ఆస్పత్రి డాక్టర్ మృతి

పద్మారావునగర్, వెలుగు: హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలోని పీడియాట్రిక్స్​ విభాగంలో పనిచేస్తున్న డాక్టర్​కార్డియక్​ అరెస్టుతో చనిపోయారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కు చెందిన ఫణీంద్ర(37) గాంధీ ఆస్పత్రిలో విధులు నిర్వర్థిస్తున్నారు. అయిదు నెలల కిందట ఆయనకు కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేసే గైనకాలజిస్ట్ తో పెండ్లి జరిగింది.
దంపతులిద్దరూ వేరువేరు చోట్ల డాక్టర్లుగా పనిచేస్తుండటంతో వీకెండ్ లో హైదరాబాద్ లో మీట్ అయ్యేవారు. ఈ వారం పద్మారావునగర్ లోని ఇంటర్నేషనల్ హోటల్లో డాక్టర్ దంపతులు బస చేశారు. సోమవారం తెల్లవారుజామున భార్యను తిరిగి కామారెడ్డికి పంపించేందుకు హోటల్ గదిలో రెడీ అవుతుండగా ఫణీంద్రకు అకస్మాత్తుగా గుండెల్లో నొప్పి వచ్చింది. దాంతో ఫణీంద్ర భార్య, ఆయనను వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే, మార్గమధ్యలోనే పణీంద్ర ప్రాణాలు విడిచారు. సోమవారం సాయంత్రం హుజూరాబాద్​లో ఫణీంద్ర అంత్యక్రియలు జరిగాయి.