ట్యాంక్ బండ్‌‌‌‌పై  నిమజ్జనం లేదు.. హుస్సేన్ సాగర్ తీరాన వెలసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు

ట్యాంక్ బండ్‌‌‌‌పై  నిమజ్జనం లేదు.. హుస్సేన్ సాగర్ తీరాన వెలసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు
  •  హుస్సేన్ సాగర్ తీరాన వెలసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు
  •     జీహెచ్‌‌‌‌ఎంసీ, పోలీస్‌‌‌‌ కమిషనర్‌‌‌‌ పేరిట హెచ్చరిక
  •     హైకోర్టు ఆదేశాల మేరకు చర్యలన్న ఆఫీసర్లు
  •     బేబీ పాండ్లలోనే నిమజ్జనం చేయాలని సూచన
  •     అడ్డుకునేందుకు సీసీ కెమెరాలు, చెక్‌‌‌‌పోస్టులు

 హైదరాబాద్ సిటీ, వెలుగు: ట్యాంక్ బండ్‌పై ఈసారి గణేశ్​విగ్రహాల నిమజ్జనాన్ని పూర్తిగా నిషేధిస్తూ జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్ పోలీసులు  ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇదివరకు హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా సాగరతీరాన హెచ్చరిక ఫ్లెక్సీలు, బ్యానర్లు వెలిశాయి. భక్తులకు సమాచారం అందించేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ల పేరిట ఈ ఫ్లెక్సీలను  ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేశారు.

పర్యావరణ పరిరక్షణ, నిమజ్జన టైంలో ట్రాఫిక్ చిక్కులు తలెత్తకుండా చూడాలన్న కోర్టు మార్గదర్శకాల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ట్యాంక్ బండ్‌పై నిమజ్జనానికి బదులుగా నగరవ్యాప్తంగా జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక బేబీ పాండ్లు,  హుస్సేన్ సాగర్ వద్ద  ఉన్న ప్రత్యామ్నాయ ప్రాంతాల్లో మాత్రమే విగ్రహాలను నిమజ్జనం చేయాలని సూచించారు. రూల్స్​ఉల్లంఘించి  ట్యాంక్ బండ్ వైపు విగ్రహాలను తరలించకుండా సీసీ కెమెరాలు, చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు.