పద్మారావునగర్, వెలుగు: తెలంగాణ మలిదశ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న గంగపుత్రులను ఉద్యమకారులుగా గుర్తించి, వారికి రాజకీయంగా సముచిత స్థానం కల్పించాలని, ప్రభుత్వ పథకాల్లో మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని తెలంగాణ గంగపుత్ర సంఘం(టీజీఎస్) రాష్ట్ర కార్యదర్శి టుంగుటూరి రాజేశ్ఖన్నా కోరారు. బేగంపేటలోని మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా భవన్లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్, సీఎం ప్రజావాణి ఇన్చార్జి డాక్టర్ జె.చిన్నారెడ్డికి వినతి పత్రం అందజేశారు. గంగపుత్రుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఆయన.. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.
