గణేష్ నిమజ్జనంలో ఆకతాయిల వీరంగం.. కుటుంబంపై దాడి

గణేష్ నిమజ్జనంలో ఆకతాయిల వీరంగం.. కుటుంబంపై దాడి

హైదరాబాద్: వనస్థలిపురం పరిధిలోని మన్సూరాబాద్ పెద్ద చెరువు దగ్గర ఆకతాయిలు వీరంగం సృష్టించారు. గణేష్ నిమజ్జనానికి వెళ్తున్న కుటుంబంపై దాడికి చేశారు. బైక్ రాంగ్ రూట్ నడిపి ఫ్యామిలి వెళ్తున్న కారుకు అడ్డంగా వచ్చి కారును ఢీట్టారు. ఇదేంటని అడిగినందుకు ఆ కుటుంబంపై గ్యాంగ్తో వచ్చి దాడి చేశారు.. అన్నదమ్ములపై కర్రలతో కొట్టారు.  పెద్దగా అరుస్తూ ఎనిమిది నెలల గర్భిణీ, పిల్లలపై దాడి చేసి భయభ్రాంతులకు గురిచేశారు. బాధితులు వనస్థలిపురం పీఎస్ లో ఫిర్యాదు చేశారు. 

మేం కార్పొరేటర్ అనుచరులం.. మమ్మల్ని ఏం చేయలేరు అంటూ బాధితులను బెదిరించారు. నిమజ్జనం సమయంలో ఇలాంటి గ్రూపులు గుంపులు, గుంపులుగా తిరుగుతూ ఇలా ప్రజలపై దాడులు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.