హైదరాబాద్లో మత్తు పదార్థాల రవాణా కోసం కేటుగాళ్లు విభిన్న మార్గాలు ఎంచుకుంటున్నారు. పాతబస్తీ నయాఫూల్ లో బాబా ముసుగులో గంజాయి అమ్ముతున్న వ్యక్తిని ఓ ఆటో డ్రైవర్ పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీ మీర్ చౌక్ లో బాబా ముసుగులో సిరాజ్ అనే వృద్ధుడు బహిరంగాగానే గంజాయి అమ్ముతున్నాడు. అటుగా వెళ్తున్న ఆటో డ్రైవర్ సిరాజ్ను పట్టుకుని మీర్చౌక్ పోలీస్ స్టేషన్ లో అప్పగించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కాగా సిటీలో డ్రగ్స్, గంజాయి అక్రమంగా తరలిస్తుండటం కలకలం రేపుతోంది. యువతే వీరి ప్రధాన టార్గెట్ కావడం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం ఇలాంటి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.