సిటీలో పలు చోట్ల గంజాయి పట్టివేత

సిటీలో పలు చోట్ల గంజాయి పట్టివేత

శంషాబాద్, వెలుగు: కాటేదాన్ స్వప్న థియేటర్‌‌‌‌‌‌‌‌ సమీపంలోని పాన్‌‌‌‌షాప్‌‌‌‌లో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న వ్యక్తిని శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. రమేశ్ చంద్రజేన్‌‌‌‌ అనే పాన్‌‌‌‌షాప్ నిర్వాహకుడు ఒరిస్సా నుంచి గంజాయి చాక్లెట్లు ఇక్కడికి తీసుకొచ్చి యువతకు అమ్ముతున్నట్లు గుర్తించారు.  నిందితుడి నుంచి 5.3 కిలోల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.  నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

జీడిమెట్ల :  సిటీలో గంజాయి సరఫరా చేస్తున్న  నల్గొండ జిల్లాకి చెందిన వెంకట కృష్ణసాయిని జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేశారు.   కుత్బుల్లాపూర్​ వెంకటేశ్వర నగర్‌‌‌‌‌‌‌‌లో ఉండే సాయి రాజస్థాన్​కి గంజాయి సరఫరా చేయడానికి   విశాఖపట్నం జిల్లా సీలేరులో గణేశ్​అనే వ్యక్తితో  డీల్​ మాట్లాడుకున్నాడు. 86 కిలోల గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్​లుగా మార్చి జేసీబీ  టైర్‌‌‌‌‌‌‌‌లో పెట్టి బొలేరో వాహనంలో ఇంటికి  తెచ్చాడు.  జీడిమెట్ల పోలీసులు, ఎస్వోటీ పోలీసులు శుక్రవారం అతడి ఇంటిపై దాడి చేసి 86 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు జీడిమెట్ల సీఐ శ్రీనివాసరావు  తెలిపారు. 

వికారాబాద్ :  కర్ణాటక నుంచి  గంజాయితో తొరుమామిడి గ్రామం వైపు వస్తున్న ఇస్తున్న వ్యక్తులను జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ ప్రశాంత్ వర్దన్, బంటార్వం పోలీసులు వారిని తనిఖీ చేయగా... వారి వద్ద 500 గ్రాముల ఎండు గంజాయి లభించింది. బైక్ ను స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.