గచ్చిబౌలి, వెలుగు: ఐటీ కారిడార్లో గంజాయి అమ్ముతున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వెస్ట్ బెంగాల్కు చెందిన మధుసుదన్హవల్దార్(23) నగరానికి వలస వచ్చి గోపన్పల్లి ఎన్టీఆర్నగర్లోని అపర్ణ లేబర్ క్యాంపులో ఉంటూ లేబర్గా పనిచేస్తున్నాడు. పక్కా సమాచారంతో గచ్చిబౌలి పోలీసులు శుక్రవారం అపర్ణ లేబర్ క్యాంపులో తనిఖీలు చేపట్టగా.. మధుసుదన్పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని రూమ్లో తనిఖీ చేయగా, 1.523 కేజీల గంజాయి పట్టుబడింది.

