బాలిస్టిక్ సెపరేటర్ ను ప్రారంభించిన గౌతమ్ గంభీర్…

బాలిస్టిక్ సెపరేటర్ ను ప్రారంభించిన గౌతమ్ గంభీర్…

బీజేపీ నాయకులు, ఈస్ట్ ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ బాలిస్టిక్ సెపరేటర్ ను ప్రారంభించారు. ఇది ఢిల్లీలోని ఘాజీపూర్ లోని ల్యాండ్ ఫిల్ లో ఉంది. ఈ  బాలిస్టిక్ సెపరేటర్ అనే మెషిన్ చెత్తను మూడు భాగాలుగా డివైడ్ చేస్తుంది. వరుసగా.. రాళ్లు, గాజు, ప్లాస్టిక్ , రెండు రకాల మట్టిని విడదీస్తుంది. గురువారం పొద్దున బాలిస్టక్ కు శంకుస్థాపన చేసిన గంభీర్.. ప్రజలు చెత్తను విధిగా డస్ట్ బిన్ లో వేయాలని చెప్పారు. రోడ్డుపై చెత్తా చెదారం వేయకుండా జాగ్రత్తపడాలని తెలిపారు. మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో వెళ్తుందని… భారత ప్రతిష్ట మరింత పెరిగిందని చెప్పారు.