న్యూఢిల్లీ: దేశ రాజధానిలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ భారీ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ను లాంచ్ చేశారు. పెద్దఎత్తున్న నిర్వహిస్తున్న ఈ డ్రైవ్లో చాలా మంది టీకా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రజలు ఎక్కడైతే ఓట్లు వేశారో, అవే బూత్ల్లో టీకా తీసుకోవచ్చని తెలిపారు.
‘నేటి నుంచి జహా ఓట్, వహాన్ వ్యాక్సినేషన్ (ఎక్కడ ఓటేస్తే, అక్కడే వ్యాక్సినేషన్) అనే క్యాంపెయిన్ను మొదలుపెడుతున్నాం. ఈ క్యాంపెయిన్లో భాగంగా ప్రజలు తాము ఓటేసిన పోలింగ్ స్టేషన్లకు వెళ్లాలి. అక్కడే టీకాను తీసుకోవాలి. త్వరలోనే ఇంటింటికీ టీకా (డోర్ టు డోర్ వ్యాక్సినేషన్)ను ప్రారంభిస్తాం. వచ్చే నాలుగు వారాల్లో 45 ఏళ్లకు పైబడిన వయస్సు వారికి వ్యాక్సినేషన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు బూత్ లెవల్ ఆఫీసర్లను నియమించామన్నారు. వీళ్లు ప్రతి ఇంటి దగ్గరకు వెళ్లి ప్రజలకు ఫస్ట్ డోస్ ఇచ్చేందుకు అవసరమైన స్లాట్ను బుకింగ్ చేస్తారని వివరించారు.