గంటా చక్రపాణికి మాతృ వియోగం

గంటా చక్రపాణికి మాతృ వియోగం

కరీంనగర్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గంటా చక్రపాణికి మాతృ వియోగం కలిగింది. ఆయన తల్లి జనని (86) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె గత నెల రోజులుగా బ్రెయిన్ హేమరేజ్ తో బాధ పడుతున్నారు. కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. గంటా చక్రపాణి స్వయంగా దగ్గరుండి చికిత్సలు చేయించినా ప్రయోజనం లేకపోయింది. ఆయన మాతృమూర్తి జనని (86) చికిత్స పొందుతూ కన్నుమూశారు.