జీహెచ్ఎంసీ అనధికార ప్రకటనలపై డ్రైవ్.. హోర్డింగ్లు, బ్యానర్లు తొలగిస్తున్నం: కమిషనర్ కర్ణన్

జీహెచ్ఎంసీ అనధికార ప్రకటనలపై డ్రైవ్.. హోర్డింగ్లు, బ్యానర్లు తొలగిస్తున్నం: కమిషనర్ కర్ణన్

హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీలో విలీనమైన వివిధ మున్సిపాలిటీల్లో అనధికార ప్రకటనలు ఉన్నట్లు గుర్తించామని కమిషనర్ ఆర్వీ కర్ణన్ శనివారం తెలిపారు. మున్సిపల్ నిబంధనల ఉల్లంఘనల నేపథ్యంలో అనధికార ప్రకటనలను గుర్తించి తొలగించేందుకు స్పెషల్ డ్రైవ్ ప్రారంభించామన్నారు. ఈ డ్రైవ్​లో భాగంగా ఇప్పటికే పలు అక్రమ హోర్డింగ్​లు, బ్యానర్లు తదితర అనధికార ప్రకటనలను తొలగించినట్లు ఆయన వెల్లడించారు. 

ప్రజా భద్రత, నగర సుందరీకరణను దృష్టిలో పెట్టుకుని జీహెచ్ఎంసీ పరిధి అంతటా ఈ డ్రైవ్​ను దశలవారీగా, నిరంతరంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అనధికార ప్రకటనలపై పర్యవేక్షణ, నియంత్రణ, చర్యల కోసం ప్రత్యేక ఎన్​ఫోర్స్‌మెంట్ బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రకటనదారులు, ప్రకటన ఏజెన్సీలు, భవన యజమానులు తప్పనిసరిగా నిబంధనలు పాటిస్తూ అవసరమైన అనుమతులు పొందిన తర్వాతే ప్రకటనలు ఏర్పాటు చేయాలని సూచించారు.