
టీమిండియా యువ సంచలనం శుభమాన్ గిల్ కొత్త బాధ్యతలు స్వీకరించనున్నాడు. రోహిత్ శర్మ తర్వాత భారత టెస్ట్ జట్టును ముందుకు తీసుకువెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు. జూన్ 20 నుంచి ఇంగ్లాండ్ తో భారత్ 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ మెగా సిరీస్ గిల్ కు అగ్ని పరీక్షగా మారింది. కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్ లోనూ గిల్ రాణించాల్సి ఉంది. ముఖ్యంగా ఇంగ్లాండ్ పిచ్ లపై గిల్ విఫలమవుతాడనే తీవ్ర విమర్శలు ఉన్నాయి. భారత టెస్ట్ కెప్టెన్సీ దక్కడం అత్యున్నత గౌరవం. 25 ఏళ్లకే కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న గిల్ భారత టెస్ట్ జట్టుకు ఓవరాల్ గా 37 వ కెప్టెన్.
ఇంగ్లాండ్ సిరీస్ కు ముందు దినేష్ కార్తీక్ తో కలిసి ఒక ఇంటర్వ్యూలో గిల్ తన అనుభవాలను పంచుకున్నాడు. ఈ ఇంటర్వ్యూ లో ఫాదర్స్ డే సందర్భంగా గిల్ తన తండ్రి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. స్కై స్పోర్ట్స్లో దినేష్ కార్తీక్తో జరిగిన సంభాషణలో గిల్ ఈ విధంగా అన్నాడు. "నిజాయితీగా చెప్పాలంటే, నేను భారత టెస్ట్ కెప్టెన్ అవుతానని నా తండ్రి కలలో ఊహించి ఉండకపోవచ్చు. నేను కూడా ఖచ్చితంగా అనుకోలేదు. మొదట్లో తనకు కెప్టెన్సీ ఇస్తారని తెలిసినా అధికారిక ప్రకటన వచ్చే వరకు నా తండ్రికి చెప్పకుండా రహస్యంగా ఉంచాను. నేను కెప్టెన్ అయిన తర్వాత నా తండ్రి నాకు ఫోన్ చేసి ఎమోషనల్ అయ్యాడు". అని గిల్ అన్నాడు.
జట్టులో ప్రతి ఒక్కరూ భద్రంగా, సంతోషంగా ఉండే సంస్కృతిని తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇండియా టెస్ట్ టీమ్ కొత్త కెప్టెన్ శుభ్మన్ గిల్ అన్నాడు.మనం సాధించిన విజయాలు, ట్రోఫీలను పక్కనబెడితే జట్టులో అందరూ సురక్షితంగా, సంతోషంగా ఉండేలా టీమ్ సంస్కృతిని నిర్మించాలనుకుంటున్నా. మనం ఆడే మ్యాచ్లు, పోటీతత్వం, భిన్నమైన జట్ల వల్ల ఇది కాస్త కష్టమైన పనే అని తెలుసు. అయినా నేను అలా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా. ప్రతి ప్లేయరు సురక్షితంగా ఉండే వాతావరణాన్ని కల్పించాలి. దానివల్ల ప్లేయర్లలో ఉండే శక్తి సామర్థ్యాలు భద్రంగా ఉంటాయని నేను భావిస్తున్నా. ఓ కెప్టెన్గా నేను చేయవలసిన ముఖ్యమైన పని కూడా ఇదే’ అని గిల్ చెప్పుకొచ్చాడు.
టెస్ట్ సిరీస్ లో భాగంగా లీడ్స్లోని హెడ్డింగ్లేలో జూన్ 20 న తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. సిరీస్లోని మిగతా నాలుగు టెస్టులకు ఎడ్జ్బాస్టన్, లార్డ్స్, ఓల్డ్ ట్రాఫోర్డ్ ఓవల్ వేదికలు కానున్నాయి. 2021-22 చివరిసారిగా భారత్ ఇంగ్లాండ్ లో పర్యటించింది. ఈ సిరీస్ 2-2 తో సమంగా ముగిసింది. 2024 ప్రారంభంలో ఇంగ్లాండ్, భారత్ చివరిసారిగా టెస్ట్ సిరీస్ ఆడాయి. ఈ సిరీస్ ను భారత్ 4-1 తేడాతో గెలుచుకుంది.
ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ 2025 టెస్ట్ సిరీస్ షెడ్యూల్
1వ టెస్ట్: జూన్ 20-24 - హెడ్డింగ్లీ, లీడ్స్
2వ టెస్టు: జూలై 2-6 - ఎడ్జ్బాస్టన్, బర్మింగ్హామ్
3వ టెస్టు: జూలై 10-14 - లార్డ్స్, లండన్
4వ టెస్టు: జూలై 23-27 - ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్
5వ టెస్టు: జూలై 31-ఆగస్టు 4 - కియా ఓవల్, లండన్
“I didn’t tell my father” 😂👌
— CricXtasy (@CricXtasy) June 15, 2025
Shubman Gill knew he was the Test captain but kept it a secret from his Father. 🇮🇳🤍 pic.twitter.com/sttSIq7IC7