జీడిమెట్ల సుభాష్ నగర్ లో బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సోమవారం రాత్రి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన బాలిక ఆ తర్వాత అదృశ్యమైంది. దీంతో బాలిక ఆచూకీ కోసం వెతుకుతుండగా... తెల్లవారుజామున 4 గంటల టైంలో మృతదేహం దొరికింది. జీడిమెట్ల పైప్ లైన్ రోడ్డులోని నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో బాలిక మృతచెందింది. అయితే బాలిక తలకు తీవ్ర గాయం అయ్యింది. దీంతో కేసు నమోదు చేసిన జీడిమెట్ల పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం గాంధీకి తరలించారు.
సుభాష్ నగర్ లో బచ్చన్ సింగ్ అనే వ్యక్తి తన భార్యపిల్లలతో ఉంటూ వెల్డింగ్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 14వ తేదీన తన కూతురు కనిపించడం లేదని జీడిమెట్ల పీఎస్ లో ఫిర్యాదు చేసాడు. 15వ తేదీ అర్దరాత్రి సుభాష్ నగర్ లోని ఓ వైన్స్ వద్ద కొత్తగా నిర్మిస్తున్న బిల్డింగ్ వద్ద తలకు గాయలతో ఓ బాలిక మృతి చెందిందని పోలీసులకు సమాచారం వచ్చింది. ఘటన స్దలంలో ఉన్న మృత దేహాన్ని మిస్సింగ్ కేసుగా నమోదైన బాలికదిగా గుర్తించారు పోలీసులు. అయితే బాలిక తండ్రి బచ్చన్ సింగ్ తన కూతురిది హత్య అని ఆరోపిస్తున్నాడు. బాలికది ఆత్మహత్యా లేక హత్య చేసారా అనే కోణంలో జీడిమెట్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చూపు లేనోళ్లకు రంగుల ప్రపంచం చూపించే డివైస్