మునుగుతున్న తండ్రిని కాపాడి కూతురు మృతి

మునుగుతున్న తండ్రిని కాపాడి కూతురు మృతి

మంగపేట, వెలుగు: గోదావరి నదికి స్నానానికి వెళ్లి..మునుగుతున్న తండ్రిని కాపాడబోయి కూతురు ప్రాణాలు విడిచింది. గ్రామస్తుల కథనం ప్రకారం ...ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన తాటిపల్లి రాజేందర్ తన రెంబో బిడ్డ నిఖిత (13)తో కలిసి సోమవారం సాయంత్రం గోదావరి నదికి స్నానానిక వెళ్లాడు. నిఖితకు తన మొబైల్​ ఇచ్చి గోదావరిలోకి దిగాడు.

 కొద్దిసేపటికే తండ్రి నీటిలో మునిగిపోవడం గమనించిన నిఖిత పరిగెత్తుకు వెళ్లి తండ్రికి చెయ్యి అందించింది. దీంతో రాజేందర్‌  బయటకు రాగా, నిఖిత ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయింది. కొంత దూరంలో ఉన్న జాలర్లు , మిషన్ భగీరథ సిబ్బంది వచ్చి నిఖితను బయటకు తీయగా అప్పటికే ప్రాణాలు కోల్పోయింది.