కంది, వెలుగు: బ్లడ్ డొనేట్ చేసేందుకు యువత ముందుకు రావాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేంద్రరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం యువ మోర్చా అధ్యక్షుడు పవన్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక పార్టీ ఆఫీసులో సుమారు 70 మంది బీజేవైఎం నాయకులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన నరేంద్ర రెడ్డి ఈ కరోనా కష్టకాలం రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని యువతకు పిలుపునిచ్చారు.


