ఊరికో మోసం…వాడకో మోసం… ఇదీ కేసీఆర్ వేషం అని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. మిడ్ మానేరు నిర్వాసితులకు ఇచ్చిన హామీ నెరవేర్చకపోగా.. వాళ్లపైనే పోలీసు జులుం చేయిస్తవా అంటూ నిప్పులు చెరిగారు. ప్రగతి భవన్ లో బిర్యానీ దావత్ ఇవ్వడమే రైతు సంక్షేమమా అని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా మిడ్ మానేరు నిర్వాసితులపై పోలీసుల దౌర్జన్యం దుర్మార్గమని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిరసన తెలుపుతున్న నిర్వాసితుల అరెస్టును ఖండిస్తున్నానన్నారు. కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ హౌస్ అరెస్టును ఖండిస్తున్నానని రేవంత్ రెడ్డి చెప్పారు. అరెస్టు చేసిన నిర్వాసితులను తక్షణం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ హామీ ఇచ్చిన ఆర్అండ్ఆర్ ప్యాకేజీ తోపాటు డబుల్ బెడ్రూం ఇళ్లు కూడా ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో నిర్వాసితులకు కాంగ్రెస్ పార్టీ అండగా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ఊరికో మోసం…వాడకో మోసం…
— Revanth Reddy (@revanth_anumula) August 29, 2022
ఇదీ కేసీఆర్ వేషం.
మిడ్ మానేరు నిర్వాసితులకు ఇచ్చిన హామీ నెరవేర్చకపోగా… వాళ్ల పై పోలీసు జులుం చేయిస్తావా!? ప్రగతి భవన్ లో బిర్యానీ దావత్ ఇవ్వడమే రైతు సంక్షేమమా!? నిర్వాసితుల అరెస్టును ఖండిస్తున్నా… తక్షణం విడుదల చెయ్యాలి. pic.twitter.com/YyZ9CSbuZz