గుండె పోటుతో గోవా డీజీపీ మృతి

గుండె పోటుతో గోవా డీజీపీ మృతి

గోవా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (DGP) ప్రణబ్ నందా ఢిల్లీలో శనివారం ఉదయం గుండెపోటుతో చనిపోయారు. అధికారిక పనికోసం ఢిల్లీ వచ్చిన ఆయన ఇవాళ తెల్లవారుజామున కార్డియాక్ అరెస్ట్ కారణంగా మృతి చెందినట్లు ఐజీ జస్పాల్ సింగ్ ప్రకటించారు. డీజీపీ నందా ఆకస్మిక మరణం తమకు షాక్ కలిగించిందన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో గోవా డీజీపీగా నందా బాధ్యతలు చేపట్టారు. 1988లో ఐపీఎస్ అధికారిగా చేరిన ప్రణబ్ నందా అరుణాచల్ ప్రదేశ్, ఢిల్లీ స్టేట్ క్యాడర్‌లలో పనిచేశారు. 2001లో కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆధీనంలోని ఇంటలిజెన్స్ బ్యూరోలో డెప్యుటేషన్ పై చేరి దేశ, విదేశాల్లో వీవీఐపీ సెక్యూరిటీ వ్యవహారాలు పర్యవేక్షించారు.

ఢిల్లీ యూనివర్శిటీలో డిగ్రీ చదివి తర్వాత సోషియాలజీలో ఆయన మాస్టర్స్ డిగ్రీ చేశారు. ప్రణబ్ నందా భార్య సుందరి కూడా ఐపీఎస్ అధికారి. పుదుచ్చేరి డీజీపీగా ఆమె పని చేశారు.