టీఆర్ఎస్​ ఓటమే లక్ష్యం: భట్టి విక్రమార్క

టీఆర్ఎస్​ ఓటమే లక్ష్యం: భట్టి విక్రమార్క

నియంత పాలన సాగిస్తున్న కేసీఆర్‌‌ను నియంత్రించడానికి ప్రజల పక్షాన ఉంటామని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. శుక్రవారం ఇందిరాభవన్‌‌లో మల్లు రవి, పొన్నం ప్రభాకర్, దాసోజు శ్రవణ్‌‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉపఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి అవకాశంగా భావించాలన్నారు. అందరి లక్ష్యం టీఆర్ఎస్ పార్టీని ఓడించడమేనని అన్నారు. గెలిచే అవకాశాలు లేవని తెలిసినా బరిలో ఉన్న సీపీఎం, టీడీపీలు సైతం కాంగ్రెస్ కు ఓటేసి టీఆర్ఎస్ ను ఓడించాలని సూచించారు. ఏం చేసినా టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటమి తప్పదని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు. భూకబ్జాలపై సైదిరెడ్డి బహిరంగ చర్చకు సిద్ధమేనా అని ప్రశ్నించారు. సకలజనులు ఏకమై ఆర్టీసీని కాపాడుకోవాలన్నారు.