కేంద్ర బడ్జెట్ లో సగటు జనానికి పెట్రోల్, డీజిల్ రూపంలో షాక్ తగిలింది. పెట్రోల్, డీజిల్ లీటర్ పై ఎక్సైజ్ డ్యూటీ, ఇన్ ఫ్రా స్ట్రక్చర్ సెస్ ఒక్కో రూపాయి చొప్పున 2 రూపాయలు పెంచుతున్నట్లు నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రకటించారు.
అటు బంగారం సహా ఇతర విలువైన లోహాలపై కస్టమ్స్ సుంకం 10 నుంచి 12.5 శాతానికి పెంచుతున్నట్లు తెలిపారు. ఇంపోర్టెడ్ బుక్స్ పైనా 5 శాతం కస్టమ్స్ సుంకం విధించారు.