కొన్ని నెలలుగా రూ.60 వేలే హద్దుగా దూసుకెళ్లిన బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. మూడు రోజులుగా వీటి ధరల్లో తగ్గుదల కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఇటీవల గోల్డ్ రేట్ పడిపోయింది.
ప్రస్తుతం హైదరాబాద్లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.54 వేల 100 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ప్రైస్ రూ.59 వేల 20 వద్ద కొనసాగుతోంది. శ్రావణ మాసంలో శుభ ముహూర్తాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి సమయంలో గోల్డ్, సిల్వర్ ధరలు పెరుగుతాయి.
కానీ ప్రస్తుతం పరిస్థితి పూర్తి విభిన్నంగా ఉంది. బంగారం ధరలు క్రమంగా తగ్గుతూ వస్తుండటంతో మగువలు గోల్డ్ కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. కొనుగోలు చేసేందుకు ఇదే మంచి సమయమని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.76 వేల 500 వద్ద కొనసాగుతోంది.