- ‘హుజూరాబాద్’లో ఓటర్లకు గూగుల్పేలో డబ్బులు పంచుతున్నరు
- సీఈవోకు బీజేపీ ఫిర్యాదు
హైదరాబాద్, వెలుగు: హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని, దీనిపై దృష్టి పెట్టాలని రాష్ట్ర బీజేపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ బుద్ధభవన్లో చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్(సీఈవో) శశాంక్ గోయల్ను బీజేపీ నాయకులు నల్లు ఇంద్రసేనా రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి, ప్రకాశ్ రెడ్డి కలిసి ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్ నేతలు ఓటర్లకు గూగుల్ పే, ఫోన్పే ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా వివిధ స్కీంల పేరుతో సీఎం కేసీఆర్, మంత్రుల ఫొటోలు పెట్టి ప్రకటనలు ఇస్తున్నారని పేర్కొన్నారు.