ఇండియాలోనే క్రోమ్‌‌బుక్స్​ తయారీ.. చేతులు కలిపిన గూగుల్​, హెచ్​పీ

ఇండియాలోనే క్రోమ్‌‌బుక్స్​ తయారీ.. చేతులు కలిపిన గూగుల్​, హెచ్​పీ

న్యూఢిల్లీ: అమెరికా ఎలక్ట్రానిక్స్​ కంపెనీ హెచ్​పీ.. గూగుల్​తో కలిపి ఇండియాలో క్రోమ్​బుక్స్ ​ల్యాప్​టాప్​తయారీని మొదలు పెట్టింది. చెన్నైలోని ఫ్లెక్స్​ ఫెసిలిటీలో ఇవి తయారవుతున్నాయి. 2020లో హెచ్​పీ ఈ ఫెసిలిటీని అందుబాటులోకి తెచ్చింది. తన ల్యాప్​టాప్​లను, డెస్క్​టాప్​లను ఇక్కడే తయారు చేస్తోంది.

ఇండియాలో క్రోమ్​బుక్స్​ తయారు చేయడం వల్ల ఇక్కడి స్టూడెంట్లకు తక్కువ ధరలో ఈ ప్రొడక్టులు దొరికేందుకు అవకాశం ఉంటుందని గూగుల్​ సీఈఓ సుందర్​ పిచాయ్​ సోమవారం  ట్విటర్‌‌‌‌లో పేర్కొన్నారు. కొత్త క్రోమ్​బుక్​ల ధరలు రూ.16 వేల నుంచి మొదలవుతాయి. ఐటీ హార్డ్​వేర్​  పీఎల్‌‌ఐకి హెచ్‌‌పీ అర్హత పొందింది.