
న్యూఢిల్లీ: అమెరికా ఎలక్ట్రానిక్స్ కంపెనీ హెచ్పీ.. గూగుల్తో కలిపి ఇండియాలో క్రోమ్బుక్స్ ల్యాప్టాప్తయారీని మొదలు పెట్టింది. చెన్నైలోని ఫ్లెక్స్ ఫెసిలిటీలో ఇవి తయారవుతున్నాయి. 2020లో హెచ్పీ ఈ ఫెసిలిటీని అందుబాటులోకి తెచ్చింది. తన ల్యాప్టాప్లను, డెస్క్టాప్లను ఇక్కడే తయారు చేస్తోంది.
ఇండియాలో క్రోమ్బుక్స్ తయారు చేయడం వల్ల ఇక్కడి స్టూడెంట్లకు తక్కువ ధరలో ఈ ప్రొడక్టులు దొరికేందుకు అవకాశం ఉంటుందని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సోమవారం ట్విటర్లో పేర్కొన్నారు. కొత్త క్రోమ్బుక్ల ధరలు రూ.16 వేల నుంచి మొదలవుతాయి. ఐటీ హార్డ్వేర్ పీఎల్ఐకి హెచ్పీ అర్హత పొందింది.