హైదరాబాద్, వెలుగు : ఇరిగేషన్ఈఎన్సీ (జనరల్) మురళీధర్రాజీనామాకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధాన బ్యారేజీ మేడిగడ్డ కుంగుబాటుతో పాటు కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింత విషయంలో ఆయన తీరుతో అసంతృప్తితో ఉన్న ప్రభుత్వం రాజీనామా చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆయన ఈ నెల 8న తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.
ఆ రాజీనామాకు ఆమోదం తెలుపుతూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మురళీధర్2013లోనే ఈఎన్సీగా రిటైర్అయ్యారు. అప్పటి నుంచి ఎక్స్టెన్షన్లో ఈ పదవిలో కొనసాగుతున్నారు. ఆయన స్థానంలో ఈఎన్సీ నియామకం కోసం ప్రతిపాదనలు పంపాలని కోరుతూ ఈఎన్సీ(అడ్మిన్) అనిల్కుమార్ ను ఆదేశించారు. కొత్త ఈఎన్సీని నియమిస్తూ సోమవారం రాత్రి ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.