రాష్ట్రంలో కొత్తగా 20 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (KGBV) మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ. 60 లక్షల నిధులను కూడా విడుదల చేసింది. కొత్తగా ఏర్పాటు కానున్న 20తో కలిపి రాష్ట్రంలో కేజీబీవీల సంఖ్య 495 కు చేరింది. వీటిల్లో 245 కేజీబీవీల్లో ఇంటర్, మరో 230 కేజీబీవీల్లో టెన్త్ వరకు ఉంది.
20 కేజీబీవీలు ఎక్కడెక్కడంటే?
- ఆదిలాబాద్ జిల్లా - మావల మండలం
- జగిత్యాల జిల్లా - బీర్పూర్ మండలం
- కరీంనగర్ - బుగ్గారం మండలం
- కరీంనగర్ - గన్నేరువరం
- మహబూబాబాద్ - దంతలపల్లి
- మెదక్ - నార్సింగి
- మెదక్ - నిజాంపేట్
- మెదక్ - హవేలి ఘన్ పూర్
- నిజామాబాద్ - నిజామాబాద్ సౌత్ మండలం
- నిజామాబాద్ - నిజామాబాద్ నార్త్ మండలం
- సంగారెడ్డి - నాగలిగిద్ద
- సంగారెడ్డి - వటపల్లి
- సంగారెడ్డి - చౌత్కూర్
- సిద్దిపేట - దూల్ మెట్ట
- వికారాబాద్ - చౌడపూర్