- ఫొటోలు క్రియేట్ చేసి నకిలీ సేల్డీడ్తో కబ్జాకు యత్నం ఏడుగురు అరెస్ట్
చందానగర్, వెలుగు : ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలంలో ఇల్లు కట్టినట్టు ఇంటి నెంబర్లు, ఫొటోలు క్రియేట్చేసి పీటీఎన్నెంబర్లు వేసి, నకిలీ సేల్డిడ్తో కబ్జా చేసేందుకు ప్రయత్నించిన ఏడుగురిని చందానగర్పోలీసులు అరెస్ట్చేశారు. చందానగర్లోని సర్వే నెంబర్లు 373,374,375లలో సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన 498 గజాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిని దక్కించుకోవడానికి కొందరు ప్లాన్వేశారు.
ఇంటి నెంబర్లు, నకిలీ పీటీఎన్నెంబర్లు, రిజిస్టర్సేల్డీడ్స్సృష్టించారు. దీన్ని గుర్తించిన సదరు శాఖ అధికారి చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నేరుటి నిరంజన్, వేణుకుమార్, క్రాంతికుమార్, రాజురవి సెల్వరాజ్, సయ్యద్ యూసుఫ్, మహమ్మద్ అజహర్అలీ, మధవ్ సుమన్ను బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
