గోదావరిలో చిక్కుకున్న గొర్రెల కాపరులను రక్షించిన అధికారులు

గోదావరిలో చిక్కుకున్న గొర్రెల కాపరులను రక్షించిన అధికారులు

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కొల్లూరు సమీపంలో నిన్న రాత్రి గోదావరిలో చిక్కుకున్న గొర్రెల కాపరులను అధికారులు రక్షించారు. స్థానికుల సహాయంతో నాటు పడవల సాయంతో వారిని ఒడ్డుకు చేర్చారు. ఐతే 3వేల గొర్లు నదిలోనే ఉండడంతో గొర్ల కాపరులు ఆవేదన వ్యక్తం చేశారు.  సంఘటన స్థలాన్ని సందర్శించిన కలెక్టర్ భారతీ హోలికెరి గొర్లను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. మొత్తం 4 బోట్ల సాయంతో అధికారులు గొర్లను ఒడ్డుకు చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులు ముందస్తు సమాచారం లేకుండా నీరు విడుదల చేయడంతోనే నదిలో ఉద్ధృతి పెరిగిందని స్థానికులు ఆగ్రహం  వ్యక్తం చేస్తున్నారు..