ఇందిరమ్మ ఇండ్ల గైడ్ లైన్స్ ఖరారు..నేడో రేపో జీవో జారీ

ఇందిరమ్మ ఇండ్ల గైడ్ లైన్స్ ఖరారు..నేడో రేపో జీవో జారీ
  • 11న భద్రాచలంలో స్కీమ్ లాంచ్​ చేయనున్న సీఎం

హైదరాబాద్, వెలుగు : ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన గైడ్ లైన్స్ ఖరారయ్యాయి. దీనికి సంబంధించిన జీవోను ప్రభుత్వం త్వరలో అధికారికంగా విడుదల చేయనుంది. ఇందులో స్కీం అమలు, లబ్ధిదారుడి ఎంపిక, దశల వారీగా ఫండ్స్ విడుదల, స్కీంకు అర్హత తదితర అంశాలపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వనుంది. మరో వారంలో లోక్​సభ ఎన్నికల షెడ్యూ ల్ రానుండటంతో స్కీంను వెంటనే స్టార్ట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 6 గ్యారంటీల్లో కీలక మైన ఇందిరమ్మ ఇండ్ల స్కీంకు లక్షల సంఖ్యలో అప్లికేషన్లు రావటంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

స్కీంను ఈ నెల 11న భద్రాచలం నియోజకవర్గంలోని బూర్గంపాడ్​లో నిర్వహించే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి లాంచ్​ చేయనున్నారు.  గైడ్ లైన్స్ ను హౌసింగ్ అధికారులు ప్రభుత్వానికి అందజేయగా సీఎం రేవంత్ రెడ్డి, హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫైనల్ చేసినట్లు అధికార వర్గాలు చెబు తున్నాయి. తొలి దశలో ప్రధానంగా బిలో పావర్టీ లైన్ లో ఉన్న వాళ్లను, సొంత జాగాలు ఉన్న వాళ్లను అర్హు లుగా గుర్తించనున్నారు.

గతంలో ఇందిరమ్మ ఇల్లు,  డబుల్ బెడ్రూం తీసుకున్న వాళ్లు అనర్హులని అధికారులు చెబుతున్నారు. సొంత జాగా ఉన్న వాళ్ల కు రూ.5 లక్షలను ఒక్కో దశలో రూ.1.25 లక్షల చొప్పున నేరుగా లబ్ధిదారుని బ్యాంక్ ఖాతాకు జమ చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కనీసం 70 గజాల ల్యాండ్ ఉండాలని, ఇందులో 400 ఎస్ఎఫ్ టీలో బెడ్ రూమ్, హాల్, కిచెన్ ఉండేలా ఇందిరమ్మ ఇంటిని డిజైన్ చేసేలా ప్లాన్ రెడీ చేసి ప్రభుత్వానికి అందచేశారు.  

18 లక్షల అప్లికెంట్లు గతంలో లబ్ధిదారులే

ప్రజావాణిలో ఇందిరమ్మ ఇండ్ల స్కీం​కు మొత్తం 82 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో గతంలో ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూం స్కీమ్ తీసుకున్న వాళ్లు 18 లక్షల మంది ఉన్నారని అధికారులు చెబుతున్నారు.