న్యూఢిల్లీ, వెలుగు : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్టాండప్ ఇండియా స్కీం దేశాభివృద్ధిలో మహిళా పారిశ్రామికవేత్తలకు తోడ్పాటు అందించడంపై దృష్టి పెడుతుందని తెలంగాణ గవర్నర్ తమిళిసై అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ సమగ్ర అభివృద్ధి దార్శనికతను గుర్తుచేసుకున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు దేశ రాజధానికి చేరుకున్న తమిళిసై.. ఢిల్లీ వర్సిటీకి చెందిన కిరోరి మాల్ కాలేజీలో భారత్ లిటరేచర్ ఫెస్టివల్కు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ‘యత్ర నార్యంతు పుజ్యంతే’అనే సెషన్లో ఆమె పాల్గొన్నారు. ప్రగతిశీల దేశాన్ని నిర్మించడం, మహిళల అభివృద్ధి, -సాధికారత అంశాలపై చర్చించారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు తిరిగి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.