కరోనా టెస్టులు మరిన్ని చేయాలి

కరోనా టెస్టులు మరిన్ని చేయాలి

కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్లో మార్పులు అవసరమన్నారు గవర్నర్ తమిళిసై. ICMR రూల్స్ ప్రకారమే టెస్టులు నిర్వహిస్తున్నా, వాటిని మరింత పెంచాలన్నారు. కరోనా వైరస్ వ్యాప్తితో హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ ను గవర్నర్ సందర్శించారు. కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న డాక్టర్లు, వైద్య సిబ్బందిని పరామర్శించారు. వారికి అందిస్తున్న వైద్యంపై ఆరా తీశారు. కరోనా యుద్ధంలో ముందు వరసలో ఉండి పోరాడుతున్న డాక్టర్లలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు వారిని పరామర్శించానన్నారు గవర్నర్. ప్రజలు కూడా కరోనాపై ఆందోళన చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

see more news

సభలో కన్నీరు పెట్టుకున్నస్పీకర్ పోచారం

భారత్ లో 2,56,611 కరోనా కేసులు..7135 మరణాలు