నార్‌‌‌‌‌‌‌‌–ఇండియా చైర్మన్‌‌‌‌గా సుమంత్ రెడ్డి, ప్రెసిడెంట్‌‌‌‌గా చంద్రేష్ విఠలాని ఎన్నిక

నార్‌‌‌‌‌‌‌‌–ఇండియా చైర్మన్‌‌‌‌గా సుమంత్ రెడ్డి, ప్రెసిడెంట్‌‌‌‌గా చంద్రేష్ విఠలాని ఎన్నిక

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: దేశంలోని రియల్‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌ ట్రాన్సాక్షన్‌‌‌‌ అడ్వైజర్స్‌‌‌‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థ  నార్‌‌‌‌‌‌‌‌–ఇండియా,  తాజాగా తమ  కొత్త జాతీయ నాయకత్వ బృందాన్ని ప్రకటించింది.  సుమంత్ రెడ్డి చైర్మన్‌‌‌‌గా, చంద్రేష్ విఠలాని ప్రెసిడెంట్‌‌‌‌గా, ఆశిష్ మెహతా ప్రెసిడెంట్-ఎలెక్ట్‌‌‌‌గా బాధ్యతలు చేపట్టారు. వైస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌, సీఈఓ, సెక్రటరీ వంటి ఇతర పదవులకు కూడా ఎన్నికలు జరిగాయి.

‘వన్ ఇండియా, వన్ లైసెన్స్‌‌‌‌’, రెరా ఫ్రేమ్‌‌‌‌వర్క్‌‌‌‌తో బలపడడం, డిజిటల్ ప్లాట్‌‌‌‌ఫారమ్ అభివృద్ధి, విద్యా–నైపుణ్య విస్తరణపై దృష్టి పెడతామని ఈ బృందం పేర్కొంది. ముంబైలో జరిగిన వార్షిక కన్వెన్షన్‌‌‌‌లో కొత్త బృందాన్ని నార్‌‌‌‌‌‌‌‌–ఇండియా సభ్యులు ఎన్నుకున్నారు.  ఈ కన్వెన్షన్‌‌‌‌లో  రూ.3 వేల కోట్లకు పైగా వ్యాపార ఒప్పందాలు కుదిరాయని సంస్థ ప్రకటించింది. 

ఇండియాలో ఆర్గనైజ్డ్ రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ ప్రభావం మరింత బలపడిందని తెలిపింది. ఈ యాన్యువల్ కన్వెన్షన్‌‌‌‌లో  సుమారు 1,800 మందికి పైగా డెలిగేట్లు పాల్గొన్నారని,   నివాస, వాణిజ్య, రిటైల్ రంగాల్లోని  ప్రాజెక్ట్‌‌‌‌లను  ప్రదర్శనకు ఉంచారని,  రిలయన్స్‌‌‌‌, టాటా, బిర్లా  వంటి పెద్ద సంస్థలు కూడా అవకాశాలను పరిశీలించాయని వివరించింది.